కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత
ABN , First Publish Date - 2020-12-13T16:22:57+05:30 IST
కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత

కర్నూలు: జిల్లాలోని పంచలిగాల చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనంలో తరలిస్తున్న రూ. 1.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన రామచౌదరి నగదుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.