రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలేంటి?
ABN , First Publish Date - 2020-04-06T09:07:01+05:30 IST
కరోనా వైరస్ కట్టడిపై ఆదివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భం గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నూ
- జగన్కు ప్రధాని ఫోన్
అమరావతి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కట్టడిపై ఆదివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భం గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నూ కాసేపు చర్చించారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పా జిటివ్ కేసులు నమోదవుతుండడంతో వైద్య సహాయంలో, ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించడంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందని.. ఢిల్లీలో తబ్లీగీ మర్కజ్ సదస్సులో పాల్గొన్నవారు.. వారితో ప్రైమరీ కాంటాక్టు అయినవారి వల్లే అత్యధికంగా కేసులు నమోదయ్యాయని.. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయని సీఎం వివరించినట్లు తెలిసింది. అలాగే కరోనా నియంత్రణకు చేపడుతున్న కార్యాచరణ గురించి తెలియజేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.