ఫార్మసి కౌన్సిల్‌లో రిజిస్టర్ కాని విద్యార్థులకు మరో అవకాశం

ABN , First Publish Date - 2020-07-20T21:32:44+05:30 IST

2019-20 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది ఫార్మసి కౌన్సిల్‌లో నమోదు కానీ విద్యార్థులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఫార్మసి కౌన్సిల్‌లో రిజిస్టర్ కాని విద్యార్థులకు మరో అవకాశం

అమరావతి: 2019-20 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది ఫార్మసి కౌన్సిల్‌లో నమోదు కానీ విద్యార్థులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు సదరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-07-20T21:32:44+05:30 IST