పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-08T16:43:32+05:30 IST
నల్లగొండ: చుండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ (22) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నల్లగొండ: చుండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ (22) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫైనాన్స్లో ఆటో తీసుకుని శ్రీకాంత్ జీవనం సాగిస్తున్నాడు. కరోనా నేపథ్యంలోనూ వాహనం ఫైనాన్స్ చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేయడంతోనే చనిపోతున్నానంటూ శ్రీకాంత్ సూసైడ్ నోట్ రాశాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫైనాన్స్ సిబ్బందిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.