3 నెలలకు సరిపడా నిత్యావసరాలు!

ABN , First Publish Date - 2020-04-01T08:20:53+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా, రానున్న మూడు నెలలకు సరిపడా సరుకులను సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో రవాణా సౌకర్యం లేక...

3 నెలలకు సరిపడా నిత్యావసరాలు!

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా, రానున్న మూడు నెలలకు సరిపడా సరుకులను సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో రవాణా సౌకర్యం లేక నిత్యావసరాల కోసం ప్రజల గాబరా పడుతున్న విషయాన్ని గుర్తించిన పలువురు మంత్రులు రానున్న కాలంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు కనీసం మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. నాణ్యమైన బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, శనగనూనె, పామాయిల్‌, ఉల్లిపాయలను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితి తీవ్రమైనప్పటికీ రేషన్‌ కార్డు దారులకు యథావిథిగా బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు ఇతర నిత్యావసరాలను ఇవ్వాలని, కార్డులు లేని వారికీ నిర్ణీత ధరలకు సరఫరా చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.   

Updated Date - 2020-04-01T08:20:53+05:30 IST