కరోనా ఎఫెక్ట్: వేలిముద్రలు గాన్.. ఫోటో గుర్తింపు ఆన్..
ABN , First Publish Date - 2020-04-01T17:51:05+05:30 IST
అమరావతి: ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోవడంతో అధికారులు పెన్షన్ల పంపిణీలో వేలిముద్రలకు స్వస్తి చెప్పారు.

అమరావతి: ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోవడంతో అధికారులు పెన్షన్ల పంపిణీలో వేలిముద్రలకు స్వస్తి చెప్పారు. ఫోటో గుర్తింపు ఆధారంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. కాగా.. ఉదయం 10 గంటలకే 77శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 59 లక్షల పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.