పెన్నానదిలో ఈతకు వెళ్లి ఏడుగురు వ్యక్తులు గల్లంతు
ABN , First Publish Date - 2020-12-17T23:22:36+05:30 IST
పెన్నానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. ఈసంఘటన సిద్దవటం దగ్గర చోటు చేసుకుంది.

కడప: పెన్నానదిలో ఈతకు వెళ్లి ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈసంఘటన సిద్దవటం దగ్గర చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తిరుపతికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.