పులివెందుల పౌరుషమంటే ఇదేనా?
ABN , First Publish Date - 2020-10-31T07:32:57+05:30 IST
సీఎం జగన్లో సీమ పౌరుషం ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు..
పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఎద్దేవా
అనంతపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్లో సీమ పౌరుషం ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోదీ మోసం చేస్తుంటే సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇదేనా పులివెందుల పౌరుషమంటే అని అనంతపురంలో ఎద్దేవా చేశారు.