ఆ బస్సులను వలసకూలీల స్వస్థలాల వరకూ నడపాలి: పవన్
ABN , First Publish Date - 2020-05-17T18:24:09+05:30 IST
వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ సూచించారు.
అమరావతి: వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ సూచించారు. వలస కార్మికుల ఆకలిదప్పులు తీర్చి ధైర్యం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సులను వలసకూలీల స్వస్థలాల వరకూ నడపాలని చెప్పారు. కేంద్రంతో రాష్ట్రాలు సమన్వయం చేసుకొని వలస కార్మికులను ఆదుకోవాలన్నారు. తాడేపల్లి దగ్గర వలస కార్మికులపై లాఠీఛార్జీ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.