కర్నూలుపై దృష్టి సారించండి : పవన్
ABN , First Publish Date - 2020-04-25T09:26:30+05:30 IST
కర్నూలుపై దృష్టి సారించండి : పవన్

అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ‘కర్నూలు జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఈ జిల్లాలో కరోనా వ్యాప్తి చెందడానికి కారణాలు, తప్పులను అన్వేషించడంలో జనసేన పార్టీకి ఎటువంటి ఆసక్తి లేదు. ప్రజల ఆరోగ్యమే జనసేన ఆకాంక్ష. ఈ సమస్య మనందరిది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తోంది’’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.