వైసీపీ అవినీతిని వకీల్ సాబ్ ఏకిపారేశారా?
ABN , First Publish Date - 2020-12-29T01:40:00+05:30 IST
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు ఉద్యమం పేరుతో టీడీపీ, నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం కోసం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో..
అమరావతి: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు ఉద్యమం పేరుతో టీడీపీ, నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం కోసం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కల్యాణ్ అయితే ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు. వరద బాధితులకు పరిహారం చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పరిమాణాలతో ‘‘జగన్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి. రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ. వరద పరిహారం కోసం అల్టిమేటం ఇచ్చిన పవన్. అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించిన జనసేన. వైసీపీ అవినీతి చిట్టా విప్పిన వకీల్ సాబ్.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.