ఒక్క ఎన్టీఆర్కే అలా జరిగింది..: పవన్
ABN , First Publish Date - 2020-02-16T18:43:35+05:30 IST
ఇవాళ రేపల్లె నియోజకవర్గం నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు.
అమరావతి : ఎంత మంది ఎన్ని తిట్టినా ఆశీర్వచనంగా భావిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇవాళ రేపల్లె నియోజకవర్గం నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఓటమి అనేది సహజమని.. తాను కుంగిపోయే వ్యక్తిని కాదన్నారు.
ఒక్క ఎన్టీఆర్కే అలా జరిగింది!
‘నేటి సమాజం స్వార్థంతో దారి పట్టింది. అన్ని ఉచితం పేరుతో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. జనసేన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంది. ఇలా పార్టీ పెట్టగానే అలా అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదు. ఆ నాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్కే అలా జరిగింది. నేను చాలా దూర దృష్టితో జనసేన పార్టీ స్థాపించాను. రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదు. అన్నీ ఆలోచించే జనసేన పార్టీని స్థాపించాను. నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. అనుమానించేలా సమాజం ఉంది. రాజకీయాల్లో అందినకాడికి సంపాదించి ప్రజలకు కొద్దిగా పెట్టడమే నేటి నేతల తీరుగా ఉంది. 2019లో జనసేన ఓటమి చెందలేదు.. ఇష్టపడి, పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి తీసుకోకుండా మనకు ఓట్లేశారు’ అని పవన్ చెప్పుకొచ్చారు.