ప్రశ్నిస్తే హత్య చేస్తారా..?: పంచుమర్తి
ABN , First Publish Date - 2020-12-29T22:54:38+05:30 IST
ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక హత్యలు చేసే నైజం వైసీపీదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.
అమరావతి: ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక హత్యలు చేసే నైజం వైసీపీదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల పేరుతో వేల కోట్ల కుంభకోణం చేసి పంచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య హత్య దారుణమన్నారు. దాడిని ఆమె ఖండించారు. వైసీపీ నాయకుల అవినీతిని ప్రశ్నించినందుకే ఈ హత్య చేశారని చెప్పారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యేనని అనురాధ అన్నారు. చేనేత వర్గాల వారిమీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధర్మవరం, మంగళగిరిల నుంచి ఈ పరిస్థితి ప్రొద్దుటూరు వరకు పాకిందని దుయ్యబ్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా ఫెయిలయ్యాయని ఆరోపించారు. చేనేత కార్మికుల ఉసురు సీఎం జగన్రెడ్డికి తప్పక తగులుతుందని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.