గుంటూరు జిల్లాలో 50కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-09T00:34:18+05:30 IST
ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా ఏపీలోని అన్ని జిల్లాలను ఈ మహమ్మారి వణికిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్నారు.

గుంటూరు: ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా ఏపీలోని అన్ని జిల్లాలను ఈ మహమ్మారి వణికిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. గుంటూరు జిల్లాలో 50కి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గుంటూరులో బుధవారం ఒక్కరోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆనందపేటలో 4, కుమ్మరిబజార్ 2, యానాదిపేట, కొరిటపాడు, అరండల్పేటలో ఒక పాజిటివ్ కేసులు నమోదయింది.