‘తక్షణమే గురుకులాలు తెరవండి’
ABN , First Publish Date - 2020-11-26T09:13:52+05:30 IST
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తక్షణమే క్లాసులు ప్రారంభించాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రాములు ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తక్షణమే క్లాసులు ప్రారంభించాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రాములు ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. 8 నుంచి పై తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని చెప్పారు. దీంతో 8,9,10, ఇంటర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.