నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
ABN , First Publish Date - 2020-04-08T13:48:03+05:30 IST
నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
విశాఖ/భీమునిపట్నం: కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పదవ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఆన్లైన్లో పాఠాలను బోధించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దూరదర్శన్ సప్తగిరి చానల్లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఈ తరగతులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. పదవ తరగతి విద్యార్థ్ధులకు ఇంకా పరీక్షలు జరగనందున వివిధ సబ్జెక్టులపై అవగాహన కల్పించడానికి ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.