మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి
ABN , First Publish Date - 2020-07-27T22:59:31+05:30 IST
మొద్దు శ్రీను హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ

విశాఖపట్నం: మొద్దు శ్రీను హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఓం ప్రకాశ్ మృతిని అధికారులు ధృవీకరించారు. కాగా, పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును జైలులోనే హత్య చేశాడు. తనను డిస్ట్రబ్ చేస్తున్నాడనే నెపంతో మొద్దు శ్రీనును తలపై డంబుల్తో కొట్టి చంపేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓం ప్రకాశ్కు జీవిత ఖైదు విధించింది. అప్పటించి ఓం ప్రకాశ్ విశాఖ సెంట్రలో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.