న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ రాజ్ భవన్
ABN , First Publish Date - 2020-12-29T23:57:01+05:30 IST
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గవర్నర్ను కలవడం
విజయవాడ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గవర్నర్ను కలవడం, రాజ్ భవన్లో ఆయనతో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకోవటం సంప్రదాయం. అయితే కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ఓపెన్ హౌస్తో సహా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించటం లేదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని ప్రముఖులు నూతన సంవత్సరానికి సంభందించి ఈ మార్పును గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన కరోనా మార్గదర్శకాలను అనుసరించి నూతన సంవత్సరాన్ని సంయమనంతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.