LIVE..గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ

ABN , First Publish Date - 2020-07-20T16:49:37+05:30 IST

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాల గవర్నర్‌ను కలవనున్నారు.

LIVE..గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ

అమరావతి: ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆయనకు గవర్నర్ అపాయింట్‌ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ గవర్నర్‌కు వినతిపగ్రం సమర్పించనున్నారు. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ అపాయింట్ కోరగా రాజ్‌భవన్ ఖరారు చేసింది.


తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్‌కు న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది.

Updated Date - 2020-07-20T16:49:37+05:30 IST