నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు అజెండాను అనుసరిస్తున్నారు: అనిల్
ABN , First Publish Date - 2020-10-30T20:46:15+05:30 IST
నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు అజెండాను అనుసరిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ యాక్షన్కి ప్రభుత్వం తలూపాలా
నెల్లూరు: నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు అజెండాను అనుసరిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ యాక్షన్కి ప్రభుత్వం తలూపాలా? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా స్కూళ్లను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని, ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదని, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జగన్ సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తున్నారని అనిల్ కుమార్ కొనియాడారు.
ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు చేస్తుండగా... వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు పెంచారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసేదాకా(వచ్చే ఏడాది మార్చి 31) ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.