కాంగ్రెస్‌ నేత గంగాధర్ కేసును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

ABN , First Publish Date - 2020-09-14T23:34:29+05:30 IST

కాంగ్రెస్‌ నేత డాక్టర్ గంగాధర్ కేసును ఎన్‌హెచ్‌ఆర్సీ స్వీకరించింది. కేసు నమోదు చేసినట్టు డాక్టర్ గంగాధర్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ సమాచారం ఇచ్చింది. కరోనా సమయంలో

కాంగ్రెస్‌ నేత గంగాధర్ కేసును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

విజయవాడ: కాంగ్రెస్‌ నేత డాక్టర్ గంగాధర్ కేసును ఎన్‌హెచ్‌ఆర్సీ స్వీకరించింది. కేసు నమోదు చేసినట్టు డాక్టర్ గంగాధర్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ సమాచారం ఇచ్చింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇబ్బందిపడుతున్నారని, ఓ చానల్‌ చర్చలో అన్నందుకు గంగాధర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహరంపై ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు సీజేకు పీసీసీ చీఫ్‌ శైలజానాథ్ లేఖరాశారు. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇవ్వాలంటూ శైలజానాధ్ వద్దకు లీగల్ సర్వీస్ అథారిటీ ప్రథినిధిని  హైకోర్టు పంపింది.

Updated Date - 2020-09-14T23:34:29+05:30 IST