బెజవాడ గ్యాంగ్ వార్లో మరో కొత్త ట్విస్ట్
ABN , First Publish Date - 2020-06-02T22:05:33+05:30 IST
బెజవాడ గ్యాంగ్ వార్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ
విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతో పాటు వ్యక్తిగత పోరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వివాదాస్పద భూముల వ్యవహారంలో సందీప్, పండు వర్గాల జోక్యం ఉన్నట్టు పోలీసులు కనిపెట్టారు. అలాగే బెజవాడలో ల్యాండ్ సెటిల్మెంట్లకు గుంటూరు జిల్లా నుంచి యువకులను, గుంటూరు జిల్లాలో వివాదాలకు బెజవాడ యువకులను ఈ గ్యాంగ్లు తీసుకెళ్తున్నట్టు తేల్చారు. వేరే ప్రాంతాల నుంచి తీసుకు వస్తే పోలీసులు గుర్తుపట్టే అవకాశం ఉండదని ఇలా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సందీప్, పండు గ్యాంగ్ వార్లో కూడా రెండు జిల్లాల వారు పాల్గొన్నారని గుర్తించారు. సందీప్, కేటీఎం పండులకు ఉన్న టిక్టాక్, ఫేస్బుక్ అకౌంట్ల ఫాలోవర్స్లో కొందరిని పోలీసులు విచారించనున్నారు.