అందులో భాగంగానే టీడీపీ దెబ్బతింది.. : నెట్టం రఘురామ్
ABN , First Publish Date - 2020-09-28T20:03:34+05:30 IST
అందులో భాగంగానే పార్టీ దెబ్బతిన్నదని విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు
అమరావతి : టీడీపీలోకి కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని అందులో భాగంగానే పార్టీ దెబ్బతిన్నదని విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా తనను నియమిచినందుకు పార్టీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 2024 ఎన్నికలు కానీ ఇంకా ముందు ఎన్నికలు జరిగిన విజయవాడ పార్లమెంట్లో టీడీపీని గెలిపించుకుంటామన్నారు. త్వరలోనే కమిటీలను పూర్తి చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
పార్టీని బలోపేతం చేస్తా..
‘ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నుండి నేను టీడీపీలో ఉన్నాను. 35 సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాను. విజయవాడ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలపై నాకు అవగాహన ఉంది. 7 నియోజకవర్గాల ఇంచార్జ్లతో సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాను. వైసీపీ పాలన ప్రజలు వంచించబడ్డారు. టీడీపీ వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి అనే విప్లవం వచ్చింది’ అని నెట్టం రఘురామ్ చెప్పుకొచ్చారు.