నెల్లూరులో 79కి చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-04-28T14:01:37+05:30 IST
నెల్లూరులో 79కి చేరిన కరోనా కేసులు

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79కి చేరింది. తాజాగా ఐసోలేషన్లో చికిత్స పొందుతూ కరోనా బాధితుడు మృతి చెందాడు. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. ఒక్కరోజే 80 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా వారం రోజుల నుంచి వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. గత సోమవారం నుంచి ఈ సోమవారం ఉదయం వరకు 530 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1177కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అవగా 911 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 31 మంది మరణించారు.