నెల్లూరు: ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు...ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-07-18T17:25:01+05:30 IST
నెల్లూరు: ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు...ఉద్రిక్తత

నెల్లూరు: జిల్లాలోని కావలి పట్టణం ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్నో ఏళ్ల కిందట ఎన్టీఆర్పై అభిమానంతో స్థానికులు సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహ తొలగింపు చర్యలను అడ్డుకోవాలని గతంలో అధికారులకు బీజేపీ నేత దగ్గుబాటి పురందీశ్వరి లేఖ రాశారు. తాజాగా విగ్రహం తొలగింపుతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.