ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారు?: బొత్స
ABN , First Publish Date - 2020-02-16T22:33:31+05:30 IST
న్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ వైసీపీతో కలిసేది లేదంటున్నారని
అమరావతి: ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ వైసీపీతో కలిసేది లేదంటున్నారని, మీతో కలుస్తామని తాము చెప్పామా అని మరోసారి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎన్డీఏతో కలిసి వెళ్తున్నామని ప్రచారం చేశారని, వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కలిస్తే తాను బయటికి పోతానని జనసేనాని పవన్ అంటున్నారని, నిన్ను ఎవరు కలవమన్నారు?, ఎవరు వెళ్లమన్నారు? బొత్స ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడులపై ఐటీశాఖ ప్రకటనలో స్పష్టంగా అక్రమాలు వివరించిందని బొత్స సత్యనారాయణ తెలిపారు.