శ్రీకాకుళం వెళ్లనున్న లోకేశ్.. అచ్చెన్న కుటుంబానికి పరామర్శ
ABN , First Publish Date - 2020-06-25T23:23:18+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో..

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని నిమ్మాడ గ్రామంలో పరామర్శించనున్నారు.
కాగా ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ప్రస్తుతం పడకపై ఏస్థితిలో ఉన్నారో అదే స్థితిలో ప్రశ్నించాలని, న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాలని పేర్కొన్నారు.