జడ్జిలపై కంప్లైట్ తప్ప... రాష్ట్రం పట్టదా: నారా లోకేష్
ABN , First Publish Date - 2020-10-14T02:47:56+05:30 IST
జడ్జిలపై కంప్లైట్ తప్ప... రాష్ట్రం పట్టదా: నారా లోకేష్
![జడ్జిలపై కంప్లైట్ తప్ప... రాష్ట్రం పట్టదా: నారా లోకేష్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020101309155420/10132020211748n88.jpg)
అమరావతి: భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయని నారా లోకేష్ అన్నారు. పంటలు మునిగిపోయాయని..రోడ్లు చెరువులయ్యాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జిలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఒక్క రోజన్నా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా? అని ఎద్దేవా చేశారు. వరదలు...బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా? అని లోకేష్ ప్రశ్నించారు.