కోడెల.. పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్స చేశారు: నారా లోకేష్
ABN , First Publish Date - 2020-09-16T21:22:01+05:30 IST
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్స చేశారన్నారు. ‘‘డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు.
అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది. మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతిగా తన వ్యక్తిత్వంతో ఆ పదవికే వన్నె తెచ్చారు. కోడెలగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.