ఆ రోజే నిజమైన మాతృదినోత్సవం: లోకేశ్
ABN , First Publish Date - 2020-05-11T10:26:21+05:30 IST
ప్రపంచమంతా అంతర్జాతీయ మాతృదినోత్సవం జరుపుకొంటుంటే రాష్ట్రం లో మాత్రం ఆ ఉత్సాహం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
![ఆ రోజే నిజమైన మాతృదినోత్సవం: లోకేశ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ప్రపంచమంతా అంతర్జాతీయ మాతృదినోత్సవం జరుపుకొంటుంటే రాష్ట్రం లో మాత్రం ఆ ఉత్సాహం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ దుర్ఘటనలో కళ్లముందే కనుపాపలు కనుమూస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మాతృమూర్తులు ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి ఉపద్రవాలు ఇకపై జరగవని ప్రతి తల్లికీ భరోసా అందిన రోజే నిజమైన మాతృదినోత్సవం జరుపుకొంటారని పేర్కొన్నారు.