ముస్లిం సోదరులు సహకరించాలి : ఏపీ వక్ఫ్బోర్డ్ సీఈవో
ABN , First Publish Date - 2020-03-27T17:31:20+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులు సహకరించాలని..
విజయవాడ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులు సహకరించాలని ఏపీ వక్ఫ్బోర్డ్ సీఈవో అలీమ్ బాషా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్, మౌసమ్లు మాత్రమే ప్రార్థనలు చేస్తారన్నారు. అయితే.. మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దని.. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెబుతున్నాయన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్ధనలు ఇంట్లో చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసిందని అలీమ్ మీడియా ముఖంగా వెల్లడించారు.