కరోనాతో ఎంపీడీవో మృతి
ABN , First Publish Date - 2020-08-01T10:10:24+05:30 IST
కరోనాతో ఎంపీడీవో మృతి

వేలేరుపాడు, జూలై 31: కరోనా ఎంపీడీవోను బలితీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు ఎంపీడీవో పి.అంకమ్మరావుతోపాటు ఆయన భార్య, కుమారుడికి జూలై 20న కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. ఉన్నతాధికారుల అనుమతితో ఎంపీడీవో కార్యాలయంపైనే వారంతా హోం ఐసొలేషన్లో ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 26న ఎంపీడీవోను ఏలూరు ఆశ్రం కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి నుంచి శ్వాస ఇబ్బందితో భాధపడిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు.