దళితులపై జరుగుతున్న దాడులపై త్వరలో ఉద్యమం: మందకృష్ణ
ABN , First Publish Date - 2020-12-28T09:04:26+05:30 IST
రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
కడప (మారుతీనగర్), డిసెంబరు 27: రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. దళిత మహిళ నాగమ్మ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.