ప్రణబ్, ఎస్పీబీ.. మాజీ సభ్యులకు సంతాపం
ABN , First Publish Date - 2020-12-01T08:44:49+05:30 IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మృతిచెందిన మాజీ సభ్యులకు శాసనసభ సంతాపం తెలిపింది.
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మృతిచెందిన మాజీ సభ్యులకు శాసనసభ సంతాపం తెలిపింది. మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, పైడికొండల మాణిక్యాలరావు, వెంకటచంద్రమోహన్రావు, మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్ థాట్రాజ్, రావి రవీంద్రనాథ్, దిరిశాల రాజగోపాల్రెడ్డి, అమ్మిరాజు, బమ్మిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీరరాఘవరావు, పూడి మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్, వైటీ రాజా, కందుల శివానందరెడ్డి, మోచర్ల జోహర్, డీఏ సత్యప్రభ మృతికి సంతాపం తెలుపుతూ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. సమావేశాల తొలిరోజైన సోమవారం తొలుత సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభాపతి తమ్మినేని సీతారాం స్వయంగా సంతాప తీర్మానాన్ని చదివారు. కాగా, ప్రణబ్, ఎస్పీబీ, మాజీ ఎమ్మెల్సీ తిరుమల శ్రీనివాస్ మృతికి శాసనమండలి సభ్యులు సంతాపం ప్రకటించారు. వారి సేవలను చైర్మన్ ఎంఏ షరీఫ్ కొనియాడారు.