కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
ABN , First Publish Date - 2020-07-27T08:30:40+05:30 IST
విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలసకు చెందిన బంక శ్రీను, మహాలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది.

డెంకాడ, జూలై 26: విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలసకు చెందిన బంక శ్రీను, మహాలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. పెద్ద కుమార్తె పుట్టిన తర్వాత దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. రెండో కుమార్తె జన్మించిన తరువాత శ్రీను నుంచి మహాలక్ష్మికి వేధింపులు పెరిగాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. చిన్న కుమార్తె రమ్య ఉంటే కాపురం చేయనని భర్త శ్రీను తెగేసి చెప్పాడు. దీంతో తాత పక్కన నిద్రిస్తున్న రమ్య(4)ను భర్త ప్రోద్బలంతో మహాలక్ష్మి బావిలో పడేసింది. ఆదివారం బావిలో బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారించగా తామే కడతేర్చామని తల్లిదండ్రులు అంగీకరించారు.