మోదీ దిగి వస్తారు: ఆర్.కృష్ణయ్య
ABN , First Publish Date - 2020-12-13T20:51:17+05:30 IST
చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయాలకు అతీతంగా

రాజమండ్రి: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయాలకు అతీతంగా పోరాడితే ప్రధాని మోదీ దిగి వస్తారని తెలిపారు. 74 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, పార్లమెంట్లో కేంద్రం బీసీ బిల్లు పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్త చేశారు.