2015లో పనిచేసిన సర్వర్లు ఇప్పుడెందుకు పనిచేయవు?

ABN , First Publish Date - 2020-12-20T09:10:31+05:30 IST

ఉపాధ్యాయుల వెబ్‌ కౌన్సెలింగ్‌ బదిలీల ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు

2015లో పనిచేసిన సర్వర్లు ఇప్పుడెందుకు పనిచేయవు?

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆందోళన


అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల వెబ్‌ కౌన్సెలింగ్‌ బదిలీల ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ పట్టింపులకు పోకుండా ఆన్‌లైన్‌ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 2015లో సక్రమంగా పనిచేసిన వెబ్‌ కౌన్సెలింగ్‌ సర్వర్లు ఇప్పుడెందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. సర్వర్లు పనిచేయకపోవడం, సబ్మిట్‌ చేసిన దరఖాస్తులను సైతం ఫ్రీజింగ్‌ చేయాలని మెలిక పెట్టడం, ఇచ్చిన ఆప్షన్లు తారుమారు కావడం టీచర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయని అన్నారు. 

Updated Date - 2020-12-20T09:10:31+05:30 IST