కోవాగ్జిన్ వలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు
ABN , First Publish Date - 2020-12-10T10:02:25+05:30 IST
కరోనా వైర్సను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా ట్రయల్ రన్కు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఆయన సతీమణి అనూరాధ వలంటీర్లుగా మారారు.
![కోవాగ్జిన్ వలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్సను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా ట్రయల్ రన్కు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఆయన సతీమణి అనూరాధ వలంటీర్లుగా మారారు. టీకా ప్రయోగాలను విజయవంతం చేసేందుకు సహకరిస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తొలి ట్రయల్లో భాగంగా ఈ నెల 7న గుంటూరు జ్వరాల ఆస్పత్రిలో ఎమ్మెల్యే దంపతులకు మొదటి డోసు టీకా ఇచ్చారు. అప్పటినుంచి వారు బయోటెక్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడంతో 28 రోజుల అనంతరం వచ్చేనెల 4న రెండో డోసు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత కాస్త తలనొప్పిగా అనిపించిందని, ఆ తర్వాత ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవని వారు తెలిపారు.