12 గంటల దీక్షకు పూనుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప

ABN , First Publish Date - 2020-04-25T16:46:07+05:30 IST

కాకినాడ: పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో..

12 గంటల దీక్షకు పూనుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప

కాకినాడ: పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా విపత్తు కారణంగా ప్రతీ పేద కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని చినరాజప్ప కోరారు. చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధాన్యం, మిర్చి, పత్తి, పండ్ల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలన్నారు.సెరి కల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్లు అందించాలని ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు. 

Updated Date - 2020-04-25T16:46:07+05:30 IST