‘పేదల ఇళ్ల స్థలాలను కోర్టుల సహకారంతో అడ్డుకుంటున్నారు’
ABN , First Publish Date - 2020-09-17T20:53:13+05:30 IST
ప్రకాశం: ప్రజలు జగన్ పక్కన నిలిచారని అశాంతి, అల్లర్లు సృష్టించి పబ్బం గడపాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని..
![‘పేదల ఇళ్ల స్థలాలను కోర్టుల సహకారంతో అడ్డుకుంటున్నారు’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ప్రకాశం: ప్రజలు జగన్ పక్కన నిలిచారని అశాంతి, అల్లర్లు సృష్టించి పబ్బం గడపాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. కోర్టులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అడ్డుకుంటున్నాడన్నారు. ప్రజలు పేదలుగానే ఉండాలని చంద్రబాబు వారి చేతుల్లో ఆయుధాలు లాగేసుకుంటున్నారని వేణుగోపాలకృష్ణ విమర్శించారు.