మంత్రి వెలంపల్లి ఇంట్లోనే ‘సింహాలు’

ABN , First Publish Date - 2020-09-19T09:15:19+05:30 IST

మంత్రి వెలంపల్లి ఇంట్లోనే ‘సింహాలు’

మంత్రి వెలంపల్లి ఇంట్లోనే ‘సింహాలు’

తాంత్రికుడి సూచన మేరకు వాటితో పూజ

జనసేన నేత పోతిన మహేశ్‌ ఆరోపణలు


విజయవాడ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఇటీవల జరిగిన వరుస సంఘటనలతో తన పదవి పోతుందని మంత్రి వెలంపల్లికి ఆందోళన పట్టుకుంది. పదవి ఉండాలంటే అమ్మవారి వెండి ఉత్సవ రథానికి ఉన్న సింహాలను పూజ గదిలో ఉంచి పూజ చేస్తే మంచిదని ఓ తాంత్రికుడు మంత్రికి సూచించారు. ఇది జరిగిన తర్వాతే వెండి సింహాలు మాయమయ్యాయి’’ అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి వెలంపల్లి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తే వెండి సింహాలు తప్పకుండా దొరుకుతాయని, తాంత్రిక పూజల కోణంలోనూ పోలీసులు విచారణ జరపాలని పోతిన డిమాండ్‌ చేశారు. వెండి సింహాలు చోరీకి గురైనట్లు మంత్రికి, ఈవోకి, దుర్గగుడి చైర్మన్‌కు... అందరికీ తెలుసన్నారు. 

Updated Date - 2020-09-19T09:15:19+05:30 IST