ఐటీ సంస్థలకు ప్రోత్సాహం: మంత్రి మేకపాటి
ABN , First Publish Date - 2020-08-01T09:43:19+05:30 IST
ఐటీ సంస్థలకు ప్రోత్సాహం: మంత్రి మేకపాటి

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): తెలుగు యువతకు ప్రాధాన్యమిచ్చే ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన అమెరికాకు చెందిన ఐటీ సర్వ్ అలియెన్స్ సంస్థ ప్రతినిధులతో వెబినార్లో మాట్లాడారు.
న్యాయసమీక్ష న్యాయమూర్తికి హైకోర్టు సీజేతో సమాన వేతనం
న్యాయ సమీక్ష కోసం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్రావుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానమైన జీతభత్యాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర అలవెన్సులు, ఇంటి అద్దె, భత్యాలు, ప్రోటోకాల్ వంటివి కూడా హైకోర్టు న్యాయమూర్తులతో సమంగానే ఉంటాయని శుక్రవారమిచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.