అయ్యన్నకు మంత్రి జయరాం కౌంటర్.. కారును 2019లోనే కొన్నారంటూ..
ABN , First Publish Date - 2020-09-19T19:03:59+05:30 IST
బెంజ్ కారు వివాదం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు-మంత్రి జయరాం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా
కర్నూలు: బెంజ్ కారు వివాదం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు-మంత్రి జయరాం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై మంత్రి జయరాం స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించిది. బుద్ధా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డుదారిలో రాజకీయాలు చేసున్న ట్విట్టర్ లోకేష్. ప్రత్యక్ష రాజకీయాలు చేయలేని వ్యక్తి నారా లోకేష్. టీడీపీ నాయకులకు పదవులు లేక మతిభ్రమిచ్చింది. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు అదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో పని చేసిన అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. 2014, 2018 సంవత్సరంలో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. బెంజ్ కారు తెలుకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లో కొనుగోలు చేశాడు. కారు ఫైనాన్స్ కట్టలేనందుకు బెంజ్ కారును ఫైనాన్షియల్ వారు సీజ్ చేశారు. 2020 జూన్లో ఈఎస్ఐ స్కాం క్రింద కేసు నమోదు అయింది. కారు తీసుకుని ఉంటే ఏ14 ముద్దాయిగా ఉన్న కార్తిక్ను నేనెందుకు కేసులో పేరు తొలగించలేదు. భూమీ కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్నందుకే ఆ భూమిని కొన్నా. భూకబ్జాకి ఎక్కడ పాల్పడలేదు’ అని మంత్రి జయరాం చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే శనివారం హైదరాబాద్ పంజాగుట్టలో మంత్రి జయరాం కుమారుడి బెంజ్ కారును ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం సీజ్ చేసింది.