టీడీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయారు: మంత్రి ధర్మాన

ABN , First Publish Date - 2020-07-02T17:34:39+05:30 IST

శ్రీకాకుళం: 104,108 వాహనాలను మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

టీడీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయారు: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం: 104,108 వాహనాలను మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 104,108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తే టీడీపీ నిరసనలు చేయటమేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. ప్రతిపక్షం అంటే విమర్శించటమే పని అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షం సద్విమర్శ చేస్తే స్వీకరిస్తామన్నారు. టీడీపీని ప్రజలు అసహ్యించుకుని 23 సీట్లకు పరిమితం చేశారన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడని ధర్మాన కొనియాడారు.

Updated Date - 2020-07-02T17:34:39+05:30 IST