సభా సంప్రదాయాల్ని చంద్రబాబు తుంగలో తొక్కారు: బొత్స
ABN , First Publish Date - 2020-12-05T19:26:06+05:30 IST
సభా సంప్రదాయాల్ని చంద్రబాబు తుంగలో తొక్కారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు
అమరావతి: సభా సంప్రదాయాల్ని చంద్రబాబు తుంగలో తొక్కారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం తీరును తప్పుపట్టారు. ‘పోడియం దగ్గరకు వెళ్లినప్పుడు 40 ఏళ్ల అనుభవం ఏమైంది? స్పీకర్ను ఏకవచనంతో పిలుస్తూ అవమానించారు. సభలో మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ల భజనకే ఉపయోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదు. ప్రజలకు ఏం చేశామన్న దాన్ని అసెంబ్లీలో వివరించాం’ అని మంత్రి పేర్కొన్నారు.