చట్టం తనపని తాను చేసుకుపోతుంది: బొత్స
ABN , First Publish Date - 2020-09-13T08:04:34+05:30 IST
చట్టం తనపని తాను చేసుకుపోతుంది: బొత్స
![చట్టం తనపని తాను చేసుకుపోతుంది: బొత్స](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డవారి పట్ల చట్టం తనపని తాను చేసుకుపోతుంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలో శనివారం మీడియాతో మాట్లాడారు. గతంలో సీబీఐ విచారణ అక్కర్లేదన్న చంద్రబాబు... ఇప్పుడు అన్నింటికీ సీబీఐ దర్యాప్తును కోరుతున్నారన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చౌకబారు మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సత్తిబాబు అన్నారు.