మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2020-12-20T20:56:53+05:30 IST
వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ

విశాఖ: వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపా? విజయసాయిరెడ్డిపై తప్పుడు ప్రచారం.. మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. మూడు రాజధానులే వైసీపీ విధానం అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.