పవన్ ఎప్పుడూ కన్ఫూజన్లోనే ఉంటారు : మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-08-04T00:34:44+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూడు రాజధానులు, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. అమరావతిని మార్చడం లేదని.. మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు.. అమరావతికి ప్రాధాన్యం తగ్గదని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయం అని అనిల్ స్పష్టం చేశారు.
ఎప్పుడూ కన్ఫూజన్లోనే..
ఈ సందర్భంగా పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారని మంత్రి ఎద్దేవా చేశారు. అసలు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో..? ఎవరికీ తెలియదని.. ఎవరికీ అర్థం కూడా కాదన్నారు. పవన్ గురించి మాట్లాడటం అనవసరమన్నారు. పవన్ ఒకసారి బీజేపీ అంటారని.. ఇంకోసారి టీడీపీ అంటారని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ మాత్రం చంద్రబాబుకే వత్తాసు పలుకుతున్నారని అనిల్ చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై పవన్, జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.