ఏలూరు ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-12-07T03:18:03+05:30 IST

ఫిట్స్ లక్షణాలతో వచ్చిన బాధితులకు సత్వర చికిత్స అందిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆదివారం ఉదయం నుంచి కేసుల సంఖ్య క్రమంగా..

ఏలూరు ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఏమన్నారంటే..

ఏలూరు: ఫిట్స్ లక్షణాలతో వచ్చిన బాధితులకు సత్వర చికిత్స అందిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆదివారం ఉదయం నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ఇప్పటి వరకు 270 కేసులు నమోదు అయినట్లు ఆళ్ల నాని తెలిపారు. 117 మంది డిశ్చార్జ్‌ కాగా మరో 30 మంది డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అస్వస్థతకు నీటి కాలుష్యం, ఫుడ్ పాయిజన్ కారణం కాదని వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారికి కోవిడ్ టెస్ట్‌లు చేశామని.. వారందరికి నెగెటివ్ వచ్చిందని తెలిపారు. నీటి పరీక్షలకు సంబంధించి రిపోర్ట్స్‌ సోమవారం వస్తాయన్నారు. ఏలూరు ఆస్పత్రికి ఎయిమ్స్‌, నిపుణులు బృందాలు రానున్నాయని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-07T03:18:03+05:30 IST