‘పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారు’
ABN , First Publish Date - 2020-02-08T21:56:15+05:30 IST
అమరావతి ఉద్యమంలో అసలు రైతులు లేనే లేరని వైసీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారని తెలిపారు.

శ్రీకాకుళం: అమరావతి ఉద్యమంలో అసలు రైతులు లేనే లేరని వైసీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారని తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా చనిపోలేదని, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్తో వేల ఎకరాలు కొట్టేశారన్నారు. దళిత ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్న చంద్రబాబును గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా 3రాజధానుల ఏర్పాటు ఆగదని మెరుగు నాగార్జున స్పష్టం చేశారు.